mt_logo

ఐదేళ్ళ కింద చాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్..

ప్రధాని మోదీ ఐదేళ్ళ కింద చాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్.. మోదీ వేషం మారింది కానీ దేశం మారలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ గాడి తప్పింది, మోదీ వేడి తగ్గింది. గత ఐదేళ్ళలో ఈ పని చేశానని చెప్పుకునే స్థితిలో మోదీ లేరు. మోదీ ఏదో చేస్తాడన్న భ్రమ దేశ ప్రజలకు ఇప్పడు తొలగిపోయింది. మోదీ, రాహుల్ కలిసినా సంపూర్జ మెజార్టీ రాదని కేటీఆర్ తేల్చిచెప్పారు.

జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే దేశంలో ఇంకా సమస్యలు ఎందుకున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. పోలవరంకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయహోదా ఇవ్వట్లేదు. టీఆర్ఎస్ ఎంపీలు 16 మంది గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటుంది. కేంద్రం మెడలు వంచి మన హక్కులు సాధించుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేటీఆర్ చెప్పారు.

నాకు ఓటెయ్యండి.. నేను కేంద్రమంత్రిని అవుతానని కిషన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. ఉన్న ఒక్క మంత్రినే తీసేసిన ఘనత బీజేపీది. రాజకీయ అవినీతికి చాలావరకు అడ్డుకట్ట వేశాం. చంద్రబాబు పొద్దున్న లేస్తే సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఉల్టా తిడితే ఆంధ్రాలో నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని చంద్రబాబు భావిస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *