mt_logo

లండన్‌లో ఘ‌నంగా “కేసీఆర్ – దీక్షా దివస్”

కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శం, ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ – UK ఆధ్వర్యంలో “కేసీఆర్ దీక్షా దివస్” ని ఘనంగా నిర్వహించారు.

నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటూ, లండన్ లో భారత హై కమీషన్ దగ్గరున్న నెహ్రూ విగ్రహం దగ్గర నుండి, సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు “శాంతి యాత్ర” (PEACE WALK) నిర్వహించారు.

UK నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ముందుగా నెహ్రూ విగ్రహానికి పూలతో నివాళార్పించి యాత్రను ప్రారంభించారు.

లండన్ వీధుల మీదిగా ప్రారంభమైన శాంతి యాత్ర, “జై తెలంగాణ, జై కేసీఆర్” నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి. మార్గ మధ్యలో ఎంతో మంది విదేశీయులు, కార్యక్రమ ఉద్దేశాన్ని అడిగి తెలుసుకొని, తన ప్రజల కోసం కేసీఆర్ గారి శాంతియుత పోరాటపటిమణి ప్రశంసించారు.

చివరిగా, “శాంతి యాత్ర” సెంట్రల్ లండన్ లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న తరువాత గాంధీ జీ విగ్రహానికి పూలతో నివాళర్పించి, అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

తరువాత ఏర్పాటు చేసిన సమావేశం లో ఎన్నారై టీ.ఆర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం “తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం. తెలంగాణ ప్రజల దశాభ్ధాల కలను సాకారం చేసేక్రమం లో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనలును ఏకం చేసి, శాంతియుత పోరాటాంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ జీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీ జీ – కేసీఆర్ గారు పాటించి రాష్ట్ర సాధానోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంథాతో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని – మార్గాన్ని చూపిన గొప్ప స్ఫూర్తి దాత నాయకుడు మన కేసీఆర్ గారని ప్రశంసించారు.

ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టమని. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారని. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలు చేతనయితే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, లేకుంటే రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు జవాబు చెప్తామని, సరైన సందర్భంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు.

చివరిగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ లండన్ నుండి కేసీఆర్ గారు తలపెట్టిన దీక్ష నుండి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ కి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు మరియు యావత్ టీ.ఆర్.ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లండన్ ఇన్చార్జ్ రత్నాకర్ కడుదుల, సభ్యులు శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి చాడా, శ్రీకాంత్ పెద్దిరాజు, సురేష్ బుడగం, సతీష్ రెడ్డి బండ, సెరు సంజయ్, సత్యం రెడ్డి కంది, వినయ్ ఆకుల, నవీన్ భువనగిరి, సత్య చిలుముల, రవి ప్రదీప్, చిత్తరంజన్ రెడ్డి, రవి రావు, అశోక్, రవి కిరణ్, వెంకీ, శ్రీనివాస్ హాజరైన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *