mt_logo

ఇండియా టుడే అవార్డు అందుకున్న కేటీఆర్

ఐటీ మంత్రి కేటీఆర్ ఇండియా టుడే అవార్డును ఢిల్లీలో శుక్రవారం అందుకున్నారు. మౌలిక వసతుల రంగానికి సంబంధించి ఇండియా టుడే ప్రధానం చేసిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్ఛ ఇస్తే త్వరగా అభివృద్ధి చెందుతాయన్నారు. చంద్రబాబు విభజన చట్టానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *