mt_logo

ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం తగదు – కేటీఆర్

ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించవద్దని, లేనిపోని విమర్శలు చేయడం మంచిది కాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఐదు కీలక గ్రామీణ పథకాలను తొలగించిందని, గ్రామీణ ప్రాంతాల మీద ప్రేమ ఉంటే కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలని పేర్కొన్నారు. కేంద్రం కుడి చేత్తో నిధులు ఇచ్చి ఎడమచేత్తో లాక్కుందన్నారు. గతంలో హైదరాబాద్ లో 87వేల పించన్లు ఇస్తే తాము ఇప్పుడు లక్షకు పైగా పించన్లు ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా గతంలో 29 లక్షల పించన్లు ఇస్తే తమ ప్రభుత్వం 33 లక్షల పించన్లు ఇస్తుందని చెప్పారు. 70 శాతం నిధులు గ్రామ పంచాయితీలకు నేరుగా వెళ్తున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *